వికారాబాద్ : కొత్త సంవత్సరానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం నుంచే వికారాబాద్ పట్టణంలో చిన్నా పెద్దా తేడా లేకుండా కేక్లు, బాణా సంచాలు, ముగ్గులు వేసేందుకు వివిధ రకాల రంగులు కొనుగోలు చేయడం కనిపించింది. పట్టణంలోని వివిధ బేకరీలలో ఆకృతుల్లో తయారు చేసిన కేకులు ప్రత్యేక ఆకర్శనీయంగా నిలిచాయి. కొత్త సంవత్సరం రోజు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయాలను అందంగా అలంకరించారు. పట్టణ ప్రజలు ఉత్సాహంతో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి ఆనందంగా స్వాగతం పలికారు.
తీసుకెళ్లిన కేకులను అర్థరాత్రి 12 గంటలకు కేకు కట్ చేసి న్యూయర్ వేడుకలు జరుపుకున్నారు. ఒక రోజు ముందుగానే కళాశాలల విద్యార్థులు స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి న్యూయర్ వేడుకలు జరుపుకున్నారు. కొవిడ్ కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు.