సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారిలోని ఫుట్పాత్లు, క్యారేజ్ వేల ను ఆక్రమిస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించడమే కాకుండా..పాదచారులు ఫుట్పాత్పై నడిచేందు కు వీలు లేకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆపరేషన్ రోప్ (రిమూవల్ ఆఫ్ ఆబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్)ను ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. బయట ఫుట్పాత్లను క్లీన్ చేయడానికి ముందే, తమ ఠాణాల ముందు ఫుట్పాత్లు సరిగ్గా ఉన్నాయా? ఆ ఫుట్పాత్లపై ప్రజలు నడిచేందుకు అవకాశముందా? ఠాణాలకు వచ్చే వా రు వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారు? పార్కింగ్ సౌకర్యం ఉందా? అనే విషయాలు కూడా ఆలోచించాల్సిన అవసరముంది.
అయితే, నగరంలోని ప్రధాన దారుల వెంబడి ఉన్న ఠాణా ల ముందు వాహనాలు పార్కింగ్ చేసే సౌకర్యం చాలా వాటికి లేదు. దీంతో చాలా ఠాణాల ముం దు వాహనాలను రోడ్డుపై ఫుట్పాత్పైనే పార్కింగ్ చేస్తుంటారు. ఇటూ శాంతిభద్రతలు, అటూ ట్రా ఫిక్ ఠాణాల ముందు ఈ పరిస్థితి ఉంది. చాలా ఠాణాల్లో వెనుక కొంతస్థలం పార్కింగ్ కోసం ఉన్నా, చాలామంది బయటే వాహనాలను పా ర్కు చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ఠాణా సిబ్బం ది తమ వాహనాలను లోపల ఉన్న పార్కింగ్ ప్లేస్లో పార్కు చేసుకుంటే, ఠాణాకు వచ్చిన వారితో ఠాణా ముందు రోడ్డు వాహనాలతో నిం డి ఉంటుంది. ఇలా రద్దీలేని ప్రాంతాలే కాకుండా నిత్యం రద్దీగా ఉంటే రోడ్లపై ఉన్న ఠాణాల వద్ద పరిస్థితి ఇది.
నడిచే స్థలమే ఉండదు…!
పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ ఠాణా ముందు ఒక వైపు పూర్తిగా ఫుట్పాత్ను పోలీసులు ఆక్రమించేశారు. రాంగ్ పార్కింగ్లలో వాహనాలు నిలిపితే ఆయా వాహనాలను క్రేన్ సహాయంతో తెచ్చి ఇక్కడే పార్కు చేస్తుంటారు. ఈ చౌరస్తాలో ఫుట్పాత్ పూర్తిగా ఆక్రమించేశారు. ఇదే ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని గమనించడం లేదంటూ స్థానికులు వాపోతున్నా రు. మధురానగర్, బంజారాహిల్స్, జూబ్లీహి ల్స్, మారేడ్పల్లి, లంగర్హౌస్, హుమాయూన్నగర్, హబీబ్నగర్, ఆసిఫ్నగర్ ఇలా పలు లా అండ్ ఆర్డర్ ఠాణాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు పేర్కొంటున్నారు. రద్దీగా ఉండే చాదర్ఘాట్ చౌరస్తాలో ఠాణా ముందు జాగలేదు.
పక్కనే వాహనాలను పార్కు చేస్తారు. ఇక్కడకు వచ్చిపోయే వారు, తరచూ పోలీసులు రోడ్డు పక్కన వాహనాలను పార్కు చేస్తుండటం తో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుంటా యి. ఇలా నగరంలోని పలు ఠాణాల వద్ద పా ర్కింగ్ స్థలాలు సరిగ్గా లేకపోవడంతో వాహనాలన్ని ఫుట్పాత్లు, రోడ్లపైనే పెడుతున్నారు. హైదరాబాద్లోని పాత కమిషనరేట్ కార్యాల యం, ప్రస్తుత సీసీఎస్ భవనం వద్ద కూడా సరై న పార్కింగ్ సౌకర్యం లేదు. ఇక్కడ వాహనాలన్నీ నిజాం కాలేజీ గోడకు పక్కనే ఉన్న ఫుట్పాత్లపై పార్కింగ్ చేస్తుంటాయి. చౌరస్తాలో ఉ న్న ఆలయం ముందు ఉన్న ప్లేస్ అంతా పార్కింగ్కే ఉపయోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే వాహనాలతో బీఆర్కేభవన్ వైపు న్న రోడ్డంతా జామై ఉంటుంది. వీటికి తోడు బడా హోటళ్లు, బార్లు, మద్యం షాపుల ఎదుట రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న పబ్ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనాలన్నీ రోడ్లపై బారులు తీరి ఉంటాయి.
ఏమి చేస్తారు…!
నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చేపట్టిన రోప్ మంచి కార్యక్రమమే. ఫుట్పాత్ వ్యాపారాలు చేయడం ఒక మాఫియా మారింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో చాలా చోట్ల ఫుట్పాత్లు నిండిపోయాయి. కొన్ని చోట్ల ఫుట్పాత్లను స్థానికంగా ఉండే నాయకులు కబ్జా చేస్తూ దానిని చిరు వ్యాపారులకు కిరాయికి ఇస్తూ నెలవారి కిరాయి వసూలు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలలో ఫుట్పాత్ ఆక్రమణలు ప్రధానమైందే. కానీ, పోలీస్ ఠాణాలతోపాటు ప్రభు త్వ కార్యాలయాల వద్ద ఏ మేర పార్కింగ్ సౌకర్యాలున్నాయి? అక్కడకు వచ్చేవారు ఫుట్పాత్లను ఆక్రమిస్తున్నారా? అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరముంది. ఆపరేషన్ రోప్ అంటూ హడావుడి చేస్తూ స్థానిక పో లీసులు అక్కడక్కడ అధికారుల మెప్పు పొందేందుకు తాపత్రయ పడుతుంటారు. పూర్తిస్థాయిలో ఆయా ఠాణాల పరిధిలో రోప్ను అమలు చేస్తే ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుందని నగరవాసులు సూచిస్తున్నారు.
ఆక్రమణల తొలగింపు
బేగంపేట్ : సికింద్రాబాద్ బేగంపేట్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఫుట్పాత్ ఆక్రమణలను గురువారం తొలగించారు. బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య ఆధ్వర్యంలో ఫుట్పాత్ ఆక్రమణలు నిర్వహించారు. బేగంపేట్ కిమ్స్, ఆసుపత్రి రోడ్డులో ఇరువైపులా ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలైన బడ్డీ కొట్లు, ఛాయ్బండి, టిఫిన్ బండ్లు ఇతర చిరు వ్యాపారాలను పూర్తి గా తొలగించారు.
అలాగే, పార్కులైన్ సెంటర్ నుంచి ప్యారడైజ్ వరకు ఆక్రమణలను తొలగించారు. ఈ తొలగింపు కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డును, ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.