పహాడీషరీఫ్:పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన శ్రీరామకాలనీలోని 18వ వార్డులో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని స్థానిక కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నదనీ, కానీ 18వ వార్డులో అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు దిశగా మంత్రి కృషి చేయాలని వారు కోరారు. కాగా ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.