పెద్దఅంబర్పేట : వినాయక చవితిని పురస్కరించుకుని అందరూ మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ జరుపుకోవాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలి, జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తన నివాసంలో సంస్థ ప్రతినిధులు కలిసి మట్టి గణపతిని అందజేశారు. మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యంతో పాటు భూసార పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో మట్టిగణపతులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి స్పందిస్తూ గాంధీ గ్లోబల్ సంస్థలు చేపట్టిన సామాజిక సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి, మహిళా కన్వీనర్ మైనేని వాణి, దశరథగౌడ్, శివకుమార్, చెన్నయ్య, రాధిక ఉన్నారు.