పరిగి టౌన్ : పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీనర్సింహాస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఆలయ ప్రారంభం పురస్కరించుకుని పుర వీధులలో శోభాయాత్ర చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పాల్గొన్నారు. దేవాలయం నుంచి బయలుదేరిన శోభాయాత్ర పురవీధుల గుండా భక్తుల నీరాజనల మధ్య భక్తులు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు అనిల్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్కుమార్, జడ్పీటీసీ హరిప్రియారెడ్డి, పూడురు మండల జడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, భాస్కర్, కౌన్సిలర్లు ఎదిరే కృష్ణ, వెంకటేష్, కో-ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్ పాల్గొన్నారు.