రంగారెడ్డి, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): నేటి నుంచి కొత్త పింఛన్దారులకు ఆసరా కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త పింఛన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. అయితే నేటి నుంచి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కొత్త పింఛన్దారులకు ఆసరా కార్డులను అందించనున్నారు. ఇందుకుగాను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు జిల్లాకు మంజూరైన కొత్త పింఛన్లకు సంబంధించిన కార్డులను జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు ఇప్పటికే చేరవేశారు.
అదేవిధంగా పాత పింఛన్దారులకు కూడా త్వరలోనే ఆసరా పింఛన్కార్డులను పంపిణీ చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో పాత పింఛన్దారులకు కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాగా, జిల్లాలో వారం, పది రోజుల్లో అందించనున్నారు. అయితే ప్రభు త్వం 57 ఏండ్లలోపు వారికి పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించడంతోపాటు పెండింగ్లో ఉన్న అన్ని పింఛన్లను కూడా మంజూరు చేసింది. ఏ దిక్కులేని వారికి ఆసరా పథకం ఎంతో అండగా నిలుస్తున్నది.
ఈనెల నుంచే డబ్బుల చెల్లింపు..
కొత్త పింఛన్దారులకు ఈనెల నుంచే డబ్బులను అధికారులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కొత్త పింఛన్దారులకు సంబంధించి ఇప్పటికే వివరాలను సేకరించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ను చేపడుతున్నారు. అయితే కొత్త పింఛన్దారులకు వారం రోజుల్లో పింఛన్లు అందనున్నాయి. పింఛన్దారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించిన అధికారులు ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 57 ఏండ్లలోపు వారితోపాటు పెండింగ్లో ఉన్న దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు కలిపి 54,661 మందికి ప్రభు త్వం కొత్త పింఛన్లను మంజూరు చేసింది.
అత్యధికంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10,025 మందికి , రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 8,089, మహేశ్వరంలో 7,794 , షాద్నగర్లో 7,136, ఎల్బీనగర్లో 6,404, చేవెళ్లలో 6,140, కల్వకుర్తి నియోజకవర్గంలో 4,697 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. అయితే కొత్త పింఛన్దారులతో జిల్లాలో పింఛన్దారుల సంఖ్య 2,12,514కు పెరుగగా..ప్రభుత్వంపై అదనంగా మరో రూ.19.61 కోట్ల భారం పడనున్నది. గతనెల వరకు జిల్లాలో వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు కలిపి 1,57,853 మంది ఆసరా పింఛన్దారులుండగా..వారికి ప్రభుత్వం ప్రతినెలా రూ.36.72 కోట్ల పింఛన్ డబ్బులను చెల్లిస్తున్నది. గతనెల వరకు జిల్లాలో 1,57,853 మంది ఆసరా పింఛన్దారులుండగా, వీరిలో వయోవృద్ధులు-49,153, వితంతువులు-74,612, దివ్యాంగులు -25,479, గీత కార్మికులు-1945, చేనేత కార్మికులు-742, ఒంటరి మహిళలు-5864, బీడీ కార్మికులు-15 మంది పింఛన్దారులున్నారు.
ఏర్పాట్లు పూర్తి
జిల్లాకు మంజూరైన కొత్త ఆసరా పింఛన్కార్డుల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కొత్త పింఛన్దారులకు కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించగా, నేటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్డులను పంపిణీ చేయనున్నారన్నారు. అదేవిధం గా కొత్త పింఛన్దారులకు ఈ నెల నుంచి డబ్బులు వారి బ్యాం కు ఖాతాల్లో జమ కానున్నాయి.
– అమయ్కుమార్,
రంగాడ్డి జిల్లా కలెక్టర్