నందిగామ, డిసెంబర్ 6 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ పాతజాతీయ రహదారి విస్తరణతో పాటు నందిగామ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం సీఐ రామయ్య, సర్పంచ్ వెంకట్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు.
రూ.67 కోట్లతో నిర్మిస్తున్న పాత జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. నందిగామలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోడ్డు పై ప్రమాదాలు జరుగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.