షాద్నగర్రూరల్ : కరోనా వ్యాధి వ్యాప్తి పై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు మాస్క్ను విధిగా ధరించాలని షాద్నగర్ పోలీసులు సూచించారు. ఇందులో భాగంగానే బుధవారం పట్టణంలో మాస్క్లు లేకుండా తిరుగుతున్న వారికి రూ. 1000 జరిమానాను విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.
మాస్క్ లేకుండా తిరుగితే జరిమాన తప్పదనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. కొవిడ్ వ్యాధి వ్యాప్తి అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.