పరిగి, ఫిబ్రవరి 29 : పరిగి పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనా సాధారణ ఆదాయం బడ్జెట్కు పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. పుర పాలక సంఘం చైర్మన్ ముకుంద అశోక్ అధ్యక్షతన గురువారం బడ్జెట్పై పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రూ.6.89కోట్లు ఆదాయం అంచనా కాగా రూ.6.85కోట్లు సాధారణ వ్యయంగా అంచనా వేస్తూ బడ్జెట్ రూ పొందించి ఆమోదం తెలిపారు. 2025 మార్చి 31వ తేదీ నాటికి రూ.3.61లక్షలు మిగులు బడ్జెట్గా పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరం సవ రణ అంచనా ఆదాయం రూ.5.63కోట్లుగా, అంచనా సాధారణ ఖర్చు రూ. 4.90కోట్లుగా పేర్కొన్నారు.
పరిగి మున్సిపాలిటీకి 2024-25 ఆర్థికత సంవత్స రంలో ఆస్తి పన్నుల రూపంలో రూ.2.25కోట్లు, దుకాణాల అద్దెల రూపంలో రూ.55.33లక్షలు, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ రసీదుల రూపంలో రూ.6లక్షలు, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా రూ.2.91కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.38 లక్షలు ఆదాయం చేకూరుతుందని అంచనా వేయడం జరిగింది. అలాగే నాన్ ప్లాన్ గ్రాంట్ల రూపంలో రూ.77.59లక్షలు, ప్లాన్ గ్రాంటుల ద్వారా రూ.10లక్షలు, ఇతర గ్రాంటుల ద్వారా రూ.9.10కోట్లు, అన్ని కలిపి సుమారు రూ.16.14కోట్లు రావచ్చని పేర్కొన్నారు.
ఇదిలావుండగా ఈసారి ఉద్యోగుల వేతనాలకు రూ. 1.82కోట్లు, పారిశుద్ధ్య పనుల నిర్వహణకు రూ.84.30లక్షలు, విద్యుత్చార్జీలకు రూ. 12లక్షలు, పది శాతం గ్రీన్ బడ్జెట్ కోసం రూ.69.39లక్షలు ఉంటుందని బడ్జెట్లో పొందుపరిచారు. నాన్ ప్లాన్ గ్రాంట్స్ కింద రూ.77.59లక్షలు, ప్లాన్ గ్రాం ట్ల కింద రూ.10లక్షలు, ఇతర గ్రాంట్ల ద్వారా రూ.9.10కోట్లు, మొత్తం రూ. 16.84కోట్లు ఖర్చుకు సంబంధించి రూపొందించిన బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమీషనర్ వెంకటయ్య, వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మీ, కౌన్సిలర్లు వాసియా తబసుమ్, అర్చన, బి.నాగేశ్వర్, టి. వెంకటేశ్, జి.రాములమ్మ, ఎదిరె కృష్ణ, ఖాజా బద్రోద్దీన్, ఎ.అనుసూయ, సమీనా బేగం, కో-ఆప్షన్ సభ్యులు ముకుంద శేఖర్, ముజమిల్, అధికారులు పాల్గొన్నారు.