వికారాబాద్, డిసెంబర్ 5: చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వికారాబాద్లో రైల్వే వంతెన నిర్మాణం, అనంతగిరి పర్యాటక కేంద్రం, శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం తదితర అంశాల అభివృద్ధి విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలో వికారాబాద్ జిల్లాలో పర్యటించి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.