మొయినాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించకుంటె మంచి జురుగుతుందనే నమ్మకంతో భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఏడాదికి ఒక్కసారి ఉత్తర ద్వారం ద్వార దర్శించుకోవడానికి అవకాశం కల్పించడంతో భక్తులు భారీగా ఆలయాలకు తరలివస్తారు. అందులో భాగంగానే మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మారుమోగింది.
వెంకన్న సన్నిధిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనీతారెడ్డి
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని గురువారం కనకమామిడిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమెతో పాటు గ్రామ సర్పంచ్ జనార్దన్రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీటీసీలు అర్చన, అంజయ్య, అరుంధతి, నాయకులు ఉన్నారు.