మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని పద్మావతి గార్డెన్లో సెంట్రింగ్ కార్మికుల అసోసియేషన్కు సంబంధించిన క్యాలెండర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుందని, ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం రూ. 6లక్షలు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. కార్మిక శాఖలో ప్రతి కార్మకుడి పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు.
కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి, సీఐ రాజు, మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పాటి జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, ఎంఏ రావూప్, యువజన విభాగం మండల అధ్యక్షుడు పాటి జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు షేక్ మహబూబ్, సెంట్రింగ్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు దర్శన్సాగర్, ప్రధానార్యదర్శి ఎల్లయ్య, కోశాధికారి నవీన్సాగర్, సభ్యులు శేఖర్, రాంరెడ్డి, మల్లేష్, బాబు, మోనా, శ్రీధర్, లక్ష్మణ్, కైసర్, నర్సింగ్, సతీష్ పాల్గొన్నారు.