నందిగామ, జనవరి 12 : ఆధునిక వ్యవసాయంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ పటేల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు, ఇండియన్ కౌన్సిల్ఫర్ అగ్రికల్చ ర్ రీసెర్చ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి, జాతీ య యువజన దినోత్సవం సందర్భంగా జాతీయ యూత్ ఆగ్రో సమ్మిట్ను గురువారం ఏర్పాటు చేశారు. మూ డు రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ పటేల్, ఇండియన్ కౌన్సిల్ఫర్ అగ్రికల్చర్ రీసర్చ్ డైరెక్టర్ ఆర్.సి అగర్వాల్ ప్రారంభించారు.
ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. దేశంలోని వివిధ 74 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 2000 మం ది విద్యార్థులు ఈ యూత్ ఆగ్రో సమ్మిట్లో పా ల్గొననున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన సేం ద్రియ వ్యవసాయం, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు పండించడం, తక్కువ భూమిలో, తక్కువ ఖర్చులతో ఎక్కువ పంటలు పండించి అధిక దిగుబడులు సాధించడం వంటి అనేక అంశాలపై విద్యార్థులు, యువత అధ్యయ నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సమ్మిట్ ఆగ్రో సమ్మిట్ కన్వీనర్ నివేదితా శ్రేయాన్స్, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సులర్లు, అద్యాపకులు శ్రీరామచంద్ర మిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.