పరిగి, ఆగస్టు 15: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పరిగి నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థలపై జాతీయ జెండా రెపరెపలాడింది. పరిగిలోని మున్సిప్ కోర్టు వద్ద జిల్లా స్పెషల్ సెషన్స్ జడ్జి సి.హెచ్.చంద్రకిషోర్, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, మున్సి పల్ కార్యాలయం మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కరణం అరవిందరావు, పంచా యతీరాజ్ అతిథిగృహం వద్ద జడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు.
పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, సురేందర్కుమార్, ప్రవీణ్కుమార్రెడ్డి, ఆంజ నేయులు, మీర్ మహమూద్అలీ తదితరులు పాల్గొన్నారు. కులకచర్లలోని పీఏసీఎస్ కార్యాలయం, డీసీసీబీ బ్యాంకు వద్ద డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ సత్య మ్మ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమాలలో జడ్పీటీసీ రాందాస్నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, ఎంపీడీవో నాగవేణి, తహసీల్దార్ మురళీధర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డిలు పాల్గొన్నారు. పూడూరు మండల పరిషత్ కార్యా లయం వద్ద ఎంపీపీ మల్లేశం, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహ సీల్దార్ రమాదేవి, పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ సతీష్రెడ్డిలు జాతీయ జెండాఎగురవేశారు. వేడుకలలో ఎస్ఐ గిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, ఎంపీడీవో ఉమాదేవి పాల్గొన్నా రు. దోమ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ అనుసూయ జాతీయ జెండా ఎగురవేయగా తహ సీల్దార్ పురుషోత్తం, ఎంపీడీవో జయరాం, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొం రాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ముందు ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఎగురువేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ పరిధిలోని కార్యాలయాల్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్కుమార్, మార్కెట్ యార్డ్లో చైర్పర్సన్ సుజాత జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిన మహనీయులను అడుగుజాడల్లో దేశ ప్రగతికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంపై ఎంపీపీ హేమీబాయి, తహసీల్దార్ కార్యాలయాలపై తహసీల్దార్లు వెంకటేశ్, ఆనంద్రావు, పీఏసీఎస్ కార్యాలయంపై చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంఈవో రాంరెడ్డి, హెచ్ఎం పాపిరెడ్డి, వైద్యాధికారి హేమంత్, ఏపీవో మల్లికార్జున్, ట్రాన్స్కో ఏఈ నాగరాజు వారి వారి కార్యాలయాలపై జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కోట్ల యాదగిరి, నారాయణరెడ్డి,వాహబ్ తదితరులు పాల్గొన్నారు.