నందిగామ, జనవరి 27 : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఎంపీపీ ప్రియాంక అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే విధంగా కృషి చేయాలన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటినని పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, వైస్ ఎంపీపీ మంజుల, ఎంపీడీవో బాల్రెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కొమ్ము కృష్ణ, కుమారస్వామిగౌడ్, రాజు, కళమ్మగౌడ్, సర్పంచ్లు నర్సింహులు, పాండురంగారెడ్డి, రజనీత, రాములమ్మ, కో ఆప్షన్ మెంబర్ బేగ్, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
మండలంలోని మాజిద్మామిడిపల్లిలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి 4వ వాలీబాల్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.