నందిగామ, మార్చి 3: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీపీఎల్ సీజన్-10 క్రికెట్ పోటీలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డితో కలిసి ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.