బడంగ్పేట/కందుకూరు, ఏప్రిల్11 : చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇం ద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్, కందుకూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని.. ప్రజా బలం ఉన్నంత వరకు ఎంతమంది పార్టీలు మారినా బీఆర్ఎస్కు నష్టం ఉండదని స్పష్టం చేశా రు. కసిగా పనిచేసి రానున్న చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి.. పార్టీ అధినేత కేసీఆర్కు కానుకగా ఇద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించా రు.
వంద రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనదని ఆరోపించారు. పాలకుల్లో అభద్రతాభావం పెరిగిందన్నారు. రాష్ర్టాభి వృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ కేసీఆర్ వెంటే ఉంటాన న్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విశ్వే శ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు సూచించారు.
చలో చేవెళ్ల కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని.. ఇందుకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి సూచించారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని సార్లరావులపల్లి తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ లావణ్యాబీరప్ప, కార్పొరేటర్లు అనిల్కుమార్, బాలమణి, రాజేందర్రెడ్డి, నర్సింహ, సురేందర్రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, అంజయ్య, దశరథ, జయేందర్, మేఘనాథ్రెడ్డి, ఇందిరమ్మ, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.