పరిగి, జనవరి 3: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం పరిగిలోని జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలికా విద్యను సావిత్రీబాయి ఫూలే ప్రోత్సహించారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిం దరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పవీణ్కుమార్రెడ్డి, పీరంపల్లి రాజు, కౌన్సిలర్లు వారాల రవీంద్ర, వెంకటేశ్, నాగేశ్వర్ ఉన్నారు.
తాండూరు: సాయిపూర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్ర మంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన మాతృమూర్తి సావిత్రీబాయి ఫూలే అన్నారు. భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి స్త్రీ విద్యా అభివృద్ధికి కృషి చేశారని తెలి పారు. నేటి యువతరం బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
బొంరాస్పేట: సావిత్రీబాయి ఫూలే ఎంతో ఆదర్శప్రాయురాలని ఎంఈవో రాంరెడ్డి, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ అన్నారు. పూలే జయంతి వేడుకలను బుధవారం మండల కేంద్రంలోని ఎంఆర్సి కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. సావిత్రీబాయి ఫూలే విగ్రహానికి వారు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళల అభ్యున్నతికి ముఖ్యంగా బాలికా విద్యకు సావిత్రీబాయి ఫూలే చేసిన కృషిని కొనియాడారు.
బాలికలకు విద్య కోసం సమాజాన్ని ఎదిరించి మొదటి సారిగా బాలికల కోసం పాఠశాలను స్థాపించారని, తదనంతరం దేశంలో 52 బాలికా పాఠశాలలను ఏర్పాటు చేసి వారికి విద్య నేర్పిందని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫూలేకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు హరిలాల్, శ్రీహరిరెడ్డి, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బాకారం చంద్రశేఖర్, అనిల్, శ్రీప్రియ పాల్గొన్నారు. భూలక్ష్మీ దేవాలయం చౌరస్తాలో ఫూలే చిత్ర పటానికి సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, కేఎన్ పీఎస్ నాయకుడు చంద్రయ్య తదితరులు నివాళులు అర్పించారు.
కులకచర్ల: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎస్వో దేవి, అధ్యా పకులు, విద్యార్థులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్: భారతీయ మహిళా సమాజానికి సావిత్రీబాయి ఫూలే జీవితం ఆదర్శమని వికా రాబాద్ సంఘం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ అన్నారు. బుధవారం స్థానిక ఎన్నేపల్లిలోని సంఘం లక్ష్మీబాయి (ఎస్ఎల్బీ) పాఠశాల కళాశాలలో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సావిత్రీబాయి లాంటి మహిళామూర్తులను ఆదర్శంగా తీర్చుకొని ఎంతో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ప్రిన్సిపాల్ విద్యార్థినులకు సూచించారు.
దోమ: సావిత్రీబాయి ఫూలే సమాజాన్ని మేల్కొలిపిన ప్రజ్ఞాశాలి అని సర్పం చ్ శాంతాకొండారెడ్డి అన్నారు. మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో సావిత్రీబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని సర్పంచ్ శాంతాకొండారెడ్డి ఎంపీటీసీ నవాజ్రెడ్డితో కలిసి ఫూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెద్దేముల్: ప్రతి విద్యార్థి సావిత్రీ బాయి ఫూలే అడుగుజాడల్లో నడుచుకొని ఉన్నతమైన జీవనాన్ని గడపాలని పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.నర్సింహులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రీ బాయి ఫూలే జయంతిని ఘనం గా నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది మక్బూల్, జమీల్, అన్వర్, రమేశ్, మాధవరెడ్డి, శ్రీనివాస్, స్వప్న, సునీత, యాదమ్మ, నర్సింహులు, స్రవంతి, లైబ్రేరియన్ కృష్ణయ్య, అనిల్, వేణు పాల్గొన్నారు.
పూడూరు: విజ్ఞానపు ఆశాజ్యోతి సావిత్రీబాయి ఫూలే అని ఎంఈవో హరిశ్చందర్, చన్గోముల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అన్నారు. మండల పరిధిలోని చన్గోముల్ పాఠశాల సముదాయ ఆవరణలో సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంఈవో హరిశ్చందర్ ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.కాంప్లెక్స్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 15 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకుడు మహిపాల్, ప్రధానోపాధ్యాయులు నారాయణ, ఖాజా, అనిత, నజీర్, ఉపాధ్యాయులు హన్మంత్రెడ్డి, శ్రీను, సీఆర్పీ మల్లేశ్ పాల్గొన్నారు.