మంచాల, అక్టోబర్ 17: రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలం ఆరుట్ల, తాళ్లపల్లిగూడ గ్రామాల చెందిన 50మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాము, మహేందర్, చిందం రఘుపతి, చిందం జంగయ్య, కందాల శ్రీశైలం ఉన్నారు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయం
షాద్నగర్, అక్టోబర్17: బీఆర్ఎస్ గెలుపు, షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వై. అంజయ్యయాదవ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఫరూఖ్నగర్ మండలం చించోడు గ్రామ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలో బీఆర్ఎస్ యువ నాయకుడు మురళీకృష్ణ సమక్షంలో చించోడు గ్రామానికి చెందిన సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు మన దేశానికే ఆదర్శమన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. కార్యక్రమంలో దామోదర్, వెంకట్రెడ్డి, సలీంలతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చౌదరిగూడ మండలం చింతకుంట తండా సర్పంచ్ హరినాయక్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఒక్క రోజు గడువక ముందే తిరిగి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆయన నాయకత్వంలోనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయనే భావనతో బీఆర్ఎస్లో తిరిగి చేరామని హరినాయక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మొద్దని కోరారు.
కులకచర్ల, అక్టోబర్ 17 : కులకచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం, కార్యకర్తల సమావేశానికి వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుకాగా, మండల పరిధిలోని కులకచర్ల, చౌడాపూర్ మండలాల అడవివెంకటాపూర్, ముజాహిద్పూర్, కులకచర్ల, దాస్యనాయక్తండాల నుంచి 500మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సమక్షంలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.