తుర్కయంజాల్,మే 5: దేవుడి పేరుతో ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ సంక్షేమ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్కుమార్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్తయ్య, కౌన్సిలర్లు అయిలయ్య, కీర్తనావిజయానంద్రెడ్డి, మంగమ్మ, కవిత, భాగ్యమ్మ, సునీల్, రవీందర్రెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, అశోక్ గౌడ్, శివకుమార్, జుల్కాదరీ అలీ, శేఖర్, గోపాల్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.