కొత్తూరు ( రంగారెడ్డి ) : సీఎం కేసీఆర్ది మాటలు కాదు చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష రుణ మాఫీ చేసిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో సీఎం కేసీఆర్( CM KCR ) , మంత్రి కేటీఆర్ ( Minister KTR ) చిత్రపటాలకు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష రుణ మాఫీ చేస్తున్న సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో నిలిచిపోతారని చెప్పారు.
గడిచిన 9 ఏండ్లుగా రైతు పక్షపాతి నిరూపించుకుంటూనే ఉన్నారని గుర్తు చేవారు. కరోనా, ఆర్థిక మాంద్యం వల్ల రుణ మాఫీ కొంత ఆలస్యం అయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహరించకున్నా ఎన్నికల వాగ్దానం మేరకు రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నారని వివరించారు. రైతులకు సహాక సహకారాలు అందించడంలో సీఎం కేసీఆర్ (CM KCR) కు దేశంలో ఎవరూ కూడా పోటీ పడే పరిస్థితి లేదని చెప్పారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, ఎంపీటీసీ చిందకింది రాజేందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, నాయకులు బ్యాగరి యాదయ్య, కమ్మరి జనార్దనచారి, రవినాయక్, కర్రోళ్ల లక్ష్మయ్య, ఆంజనేయులు, బండి శ్రవణ్ పాల్గొన్నారు.