చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 22 : తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన మాజీ హోం, విద్యాశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ఇంద్రారెడ్డినగర్, చిట్టంపల్లిగేట్ సమీపంలోని ఇంద్రారెడ్డి విగ్రహాలకు మొదటగా మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి నివాళులర్పించారు.
అనంతరం స్వగ్రామమైన కౌకుంట్లలోని వ్యవసాయ క్షేత్రంలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్య, కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రజల ముద్దు బిడ్డగా.. బడుగు బలహీన వర్గాలకు బాసటగా.. నిస్సహాయులకు నీడగా, పేదలకు అండగా నిలిచిన ఇంద్రారెడ్డి పేదల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, మంత్రి సబితారెడ్డి కుమారులు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, మనుమడు ఇంద్ర, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, సర్పంచ్లు గాయత్రి, సులోచన, విజయలక్ష్మి, జహంగీర్, నర్సింహులు, లావణ్య, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, కౌకుంట్ల ఉప సర్పంచ్ అబ్దుల్ ఇనాయత్, కళాకారుడు నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు, ఇంద్రారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
శంకర్పల్లిలోని ఇంద్రారెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చేవెళ్లటౌన్ : తరాలు మారినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఘనత ఇంద్రారెడ్డికే దక్కుతుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని అయన విగ్రహానికి కుమారులు కార్తీక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కౌశిక్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి మంత్రి సబితారెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, వైస్ ఎంపీపీ ప్రసాద్, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, సర్పంచ్ శంకర్, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, నాయకులు రమణారెడ్డి, మాధవగౌడ్, యాదగిరి, నరేందర్గౌడ్, వెంకటేశ్ ఉన్నారు.
మొయినాబాద్ : చేవెళ్ల ప్రజలు పట్లోళ్ల కుటుంబానికి రాజకీయ జీవితాన్ని అందించారని, చేవెళ్ల ప్రజలకు రుణపడి ఉంటామని.. జీవితాంతం చేవెళ్ల ప్రజలకు సేవలు చేస్తామని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి మంత్రితో పాటు ఆమె తనయుడు కళ్యాణ్రెడ్డి, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్ తదితరులు నివాళులర్పించారు.
కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జనార్దన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, ఎంపీటీసీల మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, మహేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, జయవంత్, ఎంఏ రవూఫ్, షేక్ మహబూబ్, సురేందగౌడ్, రవీందర్రెడ్డి, భాస్కరాచారి, అంజిరెడ్డి పాల్గొన్నారు.