మహేశ్వరం, నవంబర్ 18 : పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని అకాన్పల్లి, గట్టుపల్లి, రామచంద్రగూడ, పెండ్యాల, కల్వకోల్, దుబ్బచెర్ల, సుభాన్పూర్, అయ్యవారి పల్లి, దిలావర్గూడ, గాంధీనగర్తండా, కోళ్లపడకల్, పోరండ్ల గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మంత్రికి జనం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గానికి ఇష్టం లేక వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ నాయకులు ఓడించాలన్నారు.
మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, రియల్ సేవకురాలికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ప్రజలే న్యాయనిర్ణేతలని ఆమె తెలిపారు. ఎల్లప్పుడు ప్రజాసేవ చేస్తున్న నియోజకవర్గం ఆడబిడ్డగా నన్ను దీవించి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి కోరారు. అభివృద్ధి పనులు పూర్తిగా కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. తెలంగాణ రాక ముందు గ్రామాలు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నాయో.. ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతు బంధు ద్వారా రైతులకు భరోసాను కల్పిస్తున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. రైతు ఏ కారణం చేతనైనా మృతి చెందితే రైతుబీమా కింద రూ.5 లక్షలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు ఏం చేశారని ప్రజలు నిలదీయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే అసైన్డ్ భూమి, లావాణి పట్టాలు ఉన్న వారందరికీ పట్టాలను అందజేయనున్నామని తెలిపారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయండి, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధును ప్రతి ఒక్కరికీ అందజేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పంచే డబ్బు సంచులకు ఇక్కడి ప్రజలు మోసపోరని ఆమె అన్నారు. కరోనాలో కానరాని నాయకులు నియోజకవర్గంలో పొద్దున్నే ఇండ్ల ముందు కనపడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక ఆడబిడ్డ యుద్ధంలో నిలబడింది.. నన్ను గెలిపించే బాధ్యతను మీరు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నియోజకవర్గానికి మరోసారి సేవచేసే భాగ్యం మరోసారి కల్పించాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలక మర్రి నర్సింహ, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బుసగల్ల జంగయ్య, రాఘవేందర్గౌడ్, అంగోతు గోపాల్నాయక్, సర్పంచ్లు అనిత ప్రభాకర్రెడ్డి, ముక్కెర యాదయ్య, శివరాజునాయక్, మంత్రి రాజేశ్, థామస్రెడ్డి, స్లీవారెడ్డి, గుత్తి పద్మపాండు, చంద్రశేఖర్రెడ్డి, నారాయణరెడ్డి, శకుంతల నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, ఎంపీటీసీలు స్వప్నారవీందర్, సువర్ణారాంరెడ్డి, నాయకులు కంది రమేశ్, బండారు లింగం, జాన్రెడ్డి, ఆంజనేయులు గౌడ్, మునగపాటి నవీన్, ఏకుల రాములు, బుగ్గని ఇస్తారి, ధార జంగయ్య, బురమోని నర్సింహయాదవ్, మద్ధి కరుణాకర్రెడ్డి, శివమూర్తి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.