పరిగి, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు త్యాగం చేసిన అమరుల త్యాగాలు మరువలేనివని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. అనేక మంది తమ జీవితాలను పణంగా పెట్టి పోరాటం కొనసాగించారన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిగిలోని కొడంగల్ క్రాస్రోడ్డులో అమరవీరులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒక్కతాటిపై నిలిచి ఉద్యమం చేపట్టారని తెలిపారు. పలువురు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని, వారి త్యాగం వృథా కాలేదన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ అహింసాయుత మార్గంలో ప్రపంచానికే దిక్సూచిలా నడిపించారన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ఈ సందర్భంగా పరిగిలోని మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అమరులకు నివాళులర్పించారు. మున్సిపల్లో తెలంగాణ ఉద్యమకారులను మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ ఘనంగా సన్మానించారు. పరిగి నియోజక వర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులకు నివాళులర్పించడంతోపాటు వారి ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, సత్యమ్మ, జడ్పీటీసీలు బి.హరిప్రియ, డీపీవో తరుణ్కుమార్, సీనియర్ నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, పరిగి, కులకచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎ.సురేందర్, బి.హరికృష్ణ, రైతుబంధు సమితి మండ లాల అధ్యక్షులు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, బోయిని లక్ష్మయ్య, ఎంపీడీవోలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కొడంగల్, జూన్ 22: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సర్కారు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతుందన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొడంగల్ ప్రాంతంలోని ఆవుల చిన్నయ్య అమరులైనట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కొడంగల్ కీలక భూమికను పోషించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణాలొడ్డిన అమరవీరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తూ.. ఆదుకొంటున్నారని, ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులందరినీ ఎమ్మెల్యే సన్మానించారు. ంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అమర వీరులకు నివాళి ఘటించారు. బొంరాస్పేట మండలంలో ఎంపీపీ హేమీబాయి, ఎంపీడీవో పాండు, వివిధ శాఖల అధికారులు అమర వీరులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి భూలక్ష్మి దేవాలయం చౌరస్తాలో మౌనం పాటించారు. పాఠశాలల్లో అమరుల సంతాప సూచకంగా మౌనం పాటించారు.
వికారాబాద్, జూన్ 22 : వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసి అధికారులు ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. చైర్పర్సన్ మంజుల, కమిషనర్ శరత్చంద్ర, వైస్చైర్పర్సన్ శంషాద్భేగం, కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, వైస్ ఎంపీపీ కొండి రాములు, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, ఏపీఎం శ్రీనివాస్, కార్యాలయ సూపరింటెండెంట్ చెన్నారెడ్డి, ఈసీ నవీన్, పంచాయతీ కార్యదర్శులు రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ధారూరు మండలంతో పాటు ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో అమలరవీరుల స్తూపం చిత్రపటానికి నివాళుల ర్పించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మౌనం పాటించారు. మర్పల్లి మండలంలో అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లలితారమేష్,జడ్పీటీసీ మధుకర్, డీఎల్పీ వో అనీత, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కోట్పల్లిలో అమరవీరుల స్తూపానికి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎస్సై సత్యనారాయణరాజు, పులువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. బంట్వారం మండలంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, సూపరింటెండెంట్ సుశీల్కుమార్ షిండే, ఏపీవో సుధాకర్,ఎంపీవో విజయ్కుమార్, ఏపీఎం ప్రకాష్ గౌడ్, ఎంఈవో చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. మోమిన్పేట, నవాబుపేట మండలాల్లో అమరవీరుల స్తూపానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.
పెద్దేముల్, జూన్ 22: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతోపాటు ఆయా మండలాల్లో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. గురువారం తాండూరు నియోజక వర్గంలోని పెద్దేముల్, యాలాల్, తాండూరు మండలం, బషీరాబాద్ మండలాల్లో ప్రజాప్రతినిధులు,అధికారులు,నాయకులు అమరవీరుల స్థూపం చిత్రపటాలకు ఘనంగా నివాళుర్పించారు. ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేసి తీర్మానాలను చేశారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పెద్దేముల్ మండలంలో ఎంపీపీ టి.అనురాధరమేశ్,ఎంపీడీవో లక్ష్మప్ప, ఎమ్మార్వో విద్యాసాగర్రెడ్డి, ఏపీవో లక్ష్మీదేవి, వ్యవసాయ అధికారి నజీరోద్దీన్, ఆయా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.