మన్సూరాబాద్, మార్చి 24: నాగోల్ డివిజన్ పరిధి జీఎస్ఐ గేటు సమీపంలోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకుని సత్కరించారు. వాకర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. యోగా షెడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయాలని కోరారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో త్వరలో మార్నింగ్ వాక్ చేపట్టి వాకర్స్ సమస్యలను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు.
మార్నింగ్, ఈవినింగ్ వాక్కు వచ్చే వాకర్స్ కోసం యోగా షెడ్డుతో పాటు ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.విక్రమ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ.వెంకటేశ్గౌడ్, ఉపాధ్యక్షులు పోచబోయిన జగదీశ్యాదవ్, నర్సింహులు, రమేశ్, కార్యనిర్వాహక కార్యదర్శులు జగన్మోహన్రెడ్డి, విశ్వనాథ్, కార్యవర్గసభ్యులు శంకర్, కృష్ణ, కొలను శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.