మేడ్చల్, జూలై 6 : పరిసరాలను శుభ్రపర్చుకుని, మొక్కలు పెంచి ఆరోగ్యంగా జీవించాలని మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధి…9వ వార్డులో చేపట్టిన పట్టణ ప్రగతిలో పాల్గొని సమస్యలు పరిశీలించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లావణ్య, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నర్సింహా రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, జూలై 6: పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నగరపాలక పరిధి… 2, 9,10వ డివిజన్లలోని వివిధ కాలనీల్లో నిర్వహించిన హరితహారం, వార్డు కమిటీ సమావేశాల్లో మేయర్ పాల్గొని, డిప్యూటీ మేయర్ శివుమార్గౌడ్, కార్పొరేటర్ సుభాష్ నాయక్లతో కలిసి మొక్కలు నాటారు. కార్పొ రేటర్లు బచ్చరాజు, వీరమల్లు సుమలత, కమిషనర్ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ డీజీఎం కార్తిక్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 6 : మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలని నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ 11, 12వ వార్డులలో, దమ్మాయిగూడ 17, 18వ వార్డులలో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చైర్మన్లు పాల్గొని మొక్కలు నాటి ఇంటింటికీ అందజేశారు. దమ్మాయిగూడ 18వ వార్డులో రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్లు ఎ.వాణి రెడ్డి, స్వామి, ప్రత్యేక అధికారులు గణేష్, పూర్ణిమ, వైస్ చైర్మన్లు నరేందర్, మల్లేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బోడుప్పల్,జూలై 6: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి.. 16వ డివిజన్ పీఎన్ఆర్ కాలనీలో మేయర్ సామల బుచ్చిరెడ్డి ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి డివిజన్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
శామీర్పేట, జూలై 6 : స్వచ్ఛ మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జవహర్నగర్ మేయర్ మేకల కావ్య అన్నారు. కార్పొరేషన్ పరిధి…15వ డివిజన్లో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి నార సంచులను పంపిణీ చేశారు. అలాగే ఒకటో డివిజన్లోని మల్లెగూడలో ప్రత్యేక అధికారి శ్రీదేవి, కార్పొరేటర్ రాజ్కుమార్ పారిశుధ్య పనులను పరిశీలించారు. 8వ వార్డు సంతోష్నగర్లో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా రోడ్డు మరమ్మతులు చేయించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువసేన అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కమిషనర్ గంగాధర్ హరితహారంతో పాటు పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు.పలు సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి బాసరేగడి, జ్ఞానాపూర్లలో పర్యటించారు. పారిశుధ్యం, విద్యుత్ తదితర సమస్యలపై చర్చించారు. కండ్లకోయలో చేపట్టిన మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు రాజకుమారి సుధాకర్, ఆంథోనమ్మ పిలిప్స్, కో ఆప్షన్ సభ్యుడు చిన్నపరెడ్డి, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.