వినాయక్నగర్/ఉస్మానియా యూనివర్సిటీ/అడ్డగుట్ట/గౌతంనగర్, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతిని మల్కాజిగిరి, కంటోన్మెంట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మం తరావు, సాయన్న మాట్లాడు తూప్రొఫెసర్ జయశంకర్ చిరస్మరణీయుడని కొనియాడారు. శుక్రవారం అల్వాల్లోని ఈ సేవ సెంటర్లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మైనంపల్లి పూలమాలవేసి నివాళులర్పించారు.
తార్నాక డివిజన్లోని లాలాపేటలో ఉన్న జయశంకర్ విగ్రహానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ నేటి యువత సార్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.