కుత్బుల్లాపూర్ జోన్ బృందం, జూలై 9 : సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని రంగారెడ్డినగర్, చింతల్, సభాష్నగర్, జీడిమెట్ల, సూరారం తదితర డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగితెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించించారు. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల డీసీలు మంగతాయారు, రవిందర్కుమార్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ రశీదాబేగం పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ఫ్రీ, డీసీ రవీందర్కుమార్, ఈఈ కృష్ణచైతన్య, శానిటేషన్ డీఈ ప్రశాంతి, ఏఈ సంపత్ పాల్గొన్నారు.
సుభాష్నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం సమస్యలపై చర్చించారు. డీసీ మంగతాయారు, ఈఈ కృష్ణ చైతన్య, నోడల్ అధికారి పాపమ్మ, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారం డివిజన్ పరిధిలోని మల్లారెడ్డినగర్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం డ్రైనేజీ, రోడ్డు, తాగునీటి పైపులైన్ల ఏర్పాటు చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీ రవీందర్కుమార్, డీఈ రాజు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలొని రాజీవ్గృహకల్ప కాలనీలో అంబేద్కర్ సొసైటీ భవన్ వద్ద నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని మొక్కలు నాటారు. ఏఈ సతీశ్, ఎలక్ట్రికల్ ఏఈ వెంకట్రెడ్డి, జలమండలి మేనేజర్ అంకిత్, సిబ్బంది పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో సంజీవయ్యనగర్లో పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, మాజీ కౌన్సిలర్లు కిషన్రావు, సూర్యప్రభతో పాటు వార్డు సభ్యులు సత్తిరెడ్డి, నాయకులు పాల్గొని మొక్కలు నాటారు.
జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని న్యూప్రశాంత్నగర్ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కేపీ విశాల్గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6,10,12,13వ వార్డుల్లో జరిగిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సన్నశ్రీశైలంయాదవ్తో కలిసి పలు చోట్ల మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘు, వైస్చైర్మన్ గంగయ్యనాయక్ మాజీ ఎంపీపీ సన్న కవిత, కౌన్సిలర్లు డప్పు కిరణ్కుమార్, సన్న రవియాదవ్, కృష్ణవేణి, వసంత, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ జెమ్మి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి కార్పొరేటర్తో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యురాలు చంద్రగిరి జ్యోతి, టీఆర్ఎస్ నేత సతీశ్తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.