దుండిగల్/కుత్బుల్లాపూర్, జూన్ 28 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులకు ఎటువంటి నిధుల కొరత లేదని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 3కోట్ల 21లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సోమవారం మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతివార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘు, వైస్చైర్మన్ గంగయ్యనాయక్తో పాటు పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే వివేకానంద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులతో కలిసి జీడిమెట్ల డివిజన్ పరిధిలోని దండమూడీ ఎన్క్లేవ్లో పర్యటించారు. ఈ సందర్భంగా వర్షపునీటి నాలాను పరిశీలించిన ఆయన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలా అభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కృష్ణ చైతన్య, ఇరిగేషన్ డీఈ నరేందర్కుమార్, ఏఈ, రామారావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
దుండిగల్, జూన్ 28 : ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్నగర్ డివిజన్ పరిధిలోని రమావత్ మోడల్ హైస్కూల్ వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టీకాను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి, మెడికల్ ఆఫీసర్ సంతోష్ పాల్గొన్నారు.
డివిజన్కు చెందిన పలువురు ఆర్పీలు సోమవారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచాలని, ఐడీ కార్డులు, పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఆర్పీల సమస్యల పరిష్కారానికి తన సహాకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు మమత, సుమిత్ర, విద్య, ఉమామహేశ్వరీ, జ్యోతి పాల్గొన్నారు.