జీడిమెట్ల, అక్టోబర్ 16 : మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శుక్రవారం సుభాష్నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్నాయక్నగర్లో ప్రవాస భారతీయులు ఎం.సాయిక్రిష్ణ, జి.శ్రీనివాస్రావు సహకారంతో రూ.5 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును ఎమ్మెల్యేతో పాటు మాజీ కార్పొరేటర్ జి.సురేశ్రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం ప్రజలకు ఉపయోగపడే వాటర్ ప్లాంటును ప్రారంభించడం సంతోషమన్నారు. కమిటీ హాల్, మినరల్ వాటర్ ప్లాంటును బస్తీలో ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి, కోశాధికారి అజయ్కుమార్, సభ్యులు గోపాల్రెడ్డి, నరేందర్రెడ్డి, సత్యనారాయణ, ప్రసాద్, నాయకులు రంగారావు, శివాజీ, శ్రీనివాసరావు, కాలనీవాసులు పాల్గొన్నారు.