కుత్బుల్లాపూర్, అక్టోబర్16 : నియోజకవర్గం పరిధిలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డినగర్లో దాతల సహకారంతో నిర్మించిన సామాజిక భవనం(కమ్యూనిటీ హాల్)ను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సామాజిక భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన పొన్నాల కిష్టమ్మవీరయ్య,సందిరి గోవర్ధన్రెడ్డి, భరతసింహా రెడ్డి సేవలు అభినందనీయమన్నారు. గతంలో ఇక్కడ తాగునీటి సమస్య అధికంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమస్యను అధిగమించామని తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కుంట సిద్ధిరాములు, సంపత్మాధవరెడ్డి, గుమ్మడి మధుసూదన్రాజు, మాధవరెడ్డి, కనకయ్య, వేణుగోపాల్, విజయ్, హరీశ్లతో పాటు స్తానిక సంక్షేమసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.