కాప్రా, జూన్ 27: పట్టణ ప్రగతికి ఎంతో కీలకమైన పారిశుధ్యాన్ని కాలనీలు, బస్తీల్లో సజావుగా నిర్వహించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాప్రా సర్కిల్ కార్యాలయంలో జూలై 1నుంచి నిర్వహించే పట్ట ణ ప్రగతిపై ముందస్తు సమీక్షా సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రతి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని, ఓపెన్ ప్లాట్లలో చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించాలని పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనులు నిర్వహించాలని సూచించారు. దోమల నివారణ, అన్నపూర్ణ క్యాంటీన్, బస్తీ దవాఖానలు, హరితహారం, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వీధి దీపాలు, ఆసరా పింఛ న్లు, కొత్త రేషన్ కార్డుల పరిశీలన, వైకుంఠధామాల్లో పచ్చదనం పరిశుభ్రత, బోర్వెల్స్ నిర్వహణ అంశాలపై తగిన శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో సర్కిల్ డీసీ ఎన్. శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రే యి, కార్పొరేటర్లు స్వర్ణరాజు, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్రెడ్డి, శాంతి, శానిటేషన్ ఎస్ఎఫ్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
రామంతాపూర్: ఎన్జీఆర్ఐ పక్కన ఉన్న అభయాంజనేయస్వామి ఆలయ స్లాబ్ పనులను ఎమ్మెల్యే సుభాష్రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ట్రస్టు బోర్డు మెంబర్లు, భక్తుల సహకారం తో పనులు వేగంగా చేస్తున్నారన్నారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. ట్రస్టు చైర్మన్ వెంకట్రెడ్డి, సభ్యులు వెంకటేశ్వర్రావు, వేముల వెంకట్రెడ్డి, సత్యపాల్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, అశోక్, శ్రీనివాస్, పూజారులు సంతోష్శర్మ, లక్ష్మణ్శర్మ, పవన్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, ప్రభాకర్రెడ్డి, శివ, గిరిబాబు, రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.