పీర్జాదిగూడ, జూన్ 21 : తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ ప్రజల ఆకాంక్ష మేరకు పీర్జాదిగూడ నగరపాలకను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సోమవారం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని రూ.కోటి 54 లక్షల మున్సిపల్ నిధులతో నగరపాలక సంస్థలో చేపడుతున్న అభివృద్ధి పనులు 9, 26వ డివిజన్లలో బీటీ, సీసీ రోడ్లు 3,13,18, 25 భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్ధేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత నిస్తుందన్నారు. కార్యక్రమంలో నగరపాలక డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి, తూంకుంట ప్రసన్నలక్ష్మీశ్రీధర్రెడ్డి, శారదాఈశ్వర్రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్నాయక్, అమర్సింగ్, కౌడె పోచయ్య, యుగేందర్రెడ్డి, సరితాదేవేందర్గౌడ్, బండి రమ్యాసతీశ్గౌడ్, మహేశ్, పప్పుల రాజేశ్వరీ అంజిరెడ్డి, బండారి మంజులారవీందర్, బొడిగ కృష్ణగౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, నాయకులు బుచ్చియాదవ్, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హరితహారంలో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడో విడుత హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నగరపాలక పరిధిలోని 3వ డివిజన్ సాయిప్రియ కాలనీలో సోమవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మేయర్ జక్క వెంకట్రెడ్డి, కార్పొరేటర్ శారదాఈశ్వర్రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.