చర్లపల్లి, సెప్టెంబర్ 15 : నియోజకవర్గ పరిధిలో బూత్ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, కార్యకర్తలు, నాయకులు కూడా చొరవ తీసుకోవాలి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంట్రీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని అణుపురం కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి డివిజన్లో టీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసేందుకు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను నాయకులు, కార్యకర్తలు గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. అదేవిధంగా పార్టీ కోసం నిరంతం పనిచేసే వారికే సముచిత స్థానం కల్పిస్తున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని వారు సూచించారు.
ఏఎస్రావునగర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడిగా కాసం మహిపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెద్దపురం కుమార్స్వామిలను నియమించారు. గౌరవ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా నాగేశ్వర్రెడ్డి, సింగారం రాజు, నర్సింహ, కోశాధికారిగా సజ్జ రామతులసి, మహిళా అధ్యక్షురాలుగా శిరీషారెడ్డి, కార్యదర్శిగా సదాలక్ష్మి, యూత్ అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా షేర్ హరినాథ్రెడ్డి, సోషల్ మీడియా సెల్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్ట యాదగిరి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కృష్ణ, బీసీసెల్ అధ్యక్షుడిగా సురేంద్రచారి, భాస్కర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ, హుస్సెన్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా సింగారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కిరణ్కుమార్, ప్రచార కార్యదర్శిగా యాకయ్య, కార్యదర్శిగా చిన్నయాదవ్లు ఎన్నికయ్యారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్రెడ్డి, కొత్త రామారావు, టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, నాయకురాలు గాదె నిర్మల, శేర్ మణెమ్మ, బేతాల బాల్రాజు, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఏనుగు సీతారామిరెడ్డి, కందాడి సుదర్శన్రెడ్డి, ఎండీ.బాజీబాషా, సురేందర్రావు, మురళిపంతులు, శోభారెడ్డి, రమాదేవి, దుర్గ, మంజుల, సత్యమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్, సెప్టెంబర్ 15 : నూతనంగా ఏర్పడ్డ టీఆర్ఎస్ డివిజన్ కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజేశేఖర్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి అన్నారు. నెహ్రూనగర్ పూనం భవన్లో రామంతాపూర్ డివిజన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పక గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వర్రావు, గడ్డం రవికుమార్, తిప్పని సంపత్కుమార్, మాజీ అధ్యక్షుడు రేపాక కుమరస్వామి, మారయ్య, భాగ్యరేఖ, శాగ రవీందర్, గరిక సుధాకర్, గాదె నిర్మలారెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ రామంతాపూర్ డివిజన్ అధ్యక్షునిగా ఎండీ ముస్తాక్, మహిళా అధ్యక్షురాలిగా స్వప్న, ప్రధాన కార్యదర్శిగా నమ్మగంటి సబిత, ఉపాధ్యక్షులుగా కుమారస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా శివ, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా రాజ్కుమార్, యువజన విభాగం అధ్యక్షులుగా ఆనంద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.