మేడ్చల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ హాల్లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాల అభివృద్ధి పనులపై వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుని పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, సీపీవో మోహన్రావు, ఆర్అండ్బీ ఈఈ, పంచాయతీ రాజ్ ఈఈ తదితరులు పాల్గొన్నారు.