ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15 : ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరినవారిలో ఖానాపూర్ మాజీ సర్పంచ్ సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు, కొహెడకు చెందిన హస్తం పార్టీ సీనియర్ నాయకులున్నారు. పార్టీలో చేరినవారంతా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ పాల్గొన్నారు.
మాడ్గుల : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని అన్నెబొయిన్పల్లి గ్రామానికి చెందిన 100 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో రూ.15 కోట్లతో బీటీ రోడ్లు వేస్తున్నామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దళితబంధు 1100ల కుటుంబాలకు మంజూరయ్యాయన్నారు. మండలానికి స్త్రీ నిధి కింద రూ.30కోట్లు మహిళలకు అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలన్నారు.
మండలంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టడం ఖాయమన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద తండాలలో బీటీ రోడ్ల కోసం రూ.100 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మండలంలోని ఇండ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి కింద రూ.3 లక్షల చొప్పున 600 మందికి ప్రొసీడింగ్లు వారంలో అందజేస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం 24 గంటల కరెంట్, రైతు బంధు అందిస్తున్నదన్నారు. మండలంలో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం లక్షల నిధులను మంజూరు చేసిందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాటపడుతున్నాయని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల, ఉపసర్పంచ్ సంజీవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.