కడ్తాల్, జనవరి 2 : ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ వివరాల ప్రకారం.. సాలార్పూర్ గ్రామానికి చెందిన నేనావత్ మోహన్, నేనావత్ రఘుల మధ్య గతంలో చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో మోహన్ (30) సాలార్పూర్ గ్రామంలో కూరగాయాలు కొనుగోలు చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు. అదే అదునుగా భావించిన రఘు బైక్పై వెనుక నుంచి వచ్చి మోహన్ ముఖంపై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన గ్రామస్తులు మోహన్ని కడ్తాల్లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెం దాడు. సోమవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సాలార్పూర్ గ్రామానికి చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు. మోహ న్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.