బొంరాస్పేట, జనవరి 9: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీ నిర్వాహకులకు చెల్లించే ధరలను ప్రభు త్వం పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. పెరిగిన ధరలు 2022 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయి. కొంతకాలంగా వేతనాలు, బిల్లులు రావడం లేదని, పెరిగిన ధరలతో మధ్యాహ్న పథకం నిర్వహణ భారంగా మారిందని వంట ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏజెన్సీలకు అవసరమైన సన్న బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నది. కూరగాయలు, కోడిగుడ్లను ఏజెన్సీ నిర్వాహకులు కొనుగోలు చేసి వండిపెట్టా లి.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పాఠశాలలు పనిచేసే వారంలో ఆరు రోజు ల్లో మూడు రోజులపాటు గుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. రోజూ పప్పు, ఒక కూర తప్పనిసరిగా ఉండాలి. గుడ్ల ధరలు పెరగడం ఏజెన్సీల నిర్వాహకులకు భారంగా మారిం ది. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల ను పెంచాలని నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ధరలను పెంచి అక్టోబర్ 1, 2022 నుంచి అమలు చేస్తూ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన బిల్లులను పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెన్సీలకు చెల్లించనున్నారు. ధరలను పెంచడం పట్ల వంట ఏజెన్సీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ధరలు ఇలా
ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఒక్కో విద్యార్థికీ రోజూ గతంలో రూ.4.97లు చెల్లించేవారు. ఇప్పుడు దానిని రూ.5.46 లకు పెంచారు. ఆరు నుంచి ఎనిమిది తర గతుల వరకు ఒక్కో విద్యార్థికీ గతంలో రూ.7.45లు చెల్లించేవారు. ప్రస్తుతం దానిని రూ.8.17లకు పెంచారు. 9-10 తరగతుల్లో ఒక్కో విద్యార్థికీ గతంలో రూ. 9.95లు చెల్లించేవారు. ఇప్పుడు దీనిని రూ.10.67లకు పెంచారు.
1,030 పాఠశాలల్లో అమలు
జిల్లాలోని 1,030 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతు న్నది. వీటిలో 165 పాఠశాలల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన పథ కాన్ని అమలు చేస్తుండగా, మిగిలిన 865 పాఠశాలల్లో 1,646 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 1,030 పాఠశాలల్లో 83, 827 మంది విద్యార్థులు చదువుకుంటుండగా వీరిలో 80 శాతానికిపైగా విద్యార్థులు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు.
ధరల పెంపు సంతోషకరం
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను పెం చడం సంతోషంగా ఉంది. పెరిగిన ధరల వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందిస్తాం. పాత ధరలతో కూరగాయలు, కోడి గుడ్లు కొనాలంటే ఇబ్బందిగా ఉండేది. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను పెంచడం చాలా బాగుంది.
-లక్ష్మీబాయి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు, పూర్యానాయక్తండా
పెరిగిన ధరలు అక్టోబర్ నుంచి అమలు
పెరిగిన మధ్యాహ్న భోజన పథకం బిల్లులను 2022 అక్టోబర్ నెల నుంచి చెల్లి స్తాం. గతంతో పోల్చుకుంటే అన్ని రకాల బిల్లులు రెగ్యులర్గా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తూనే ఉన్నాం. పెరిగిన ధరలతో నిర్వాహకులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.
-రేణుకాదేవి, వికారాబాద్ డీఈవో