రంగారెడ్డి, నవంబరు 4 (నమస్తే తెలంగాణ) : ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్లో సోమవారం ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సబితారెడ్డిని కేటీఆర్ అభినందించారు. యువ నేత కార్తీక్రెడ్డితోపాటు మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ను కలిశారు.