ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టు తరలి వచ్చి సందడి చేశారు. ప్రాజెక్టులో బోటింగ్ చేసేందుకు ఉత్సాహం చూపారు. బోటింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. చుట్టు పక్కల కాకుండా దూర ప్రాంతాల నుంచి సైతం అధిక సంఖ్యలో ప్యామిలీతో కలిసి వచ్చారు. బోటింగ్ చేసి ప్రాజెక్టులోని నీటిలో ఎంజాయ్ చేసి తమతమ గమ్యలకు తిరిగి వెళ్లారు.