కొత్తూరు రూరల్ : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృష్ణయ్య పదొన్నతిపై డిస్ట్రిక్ సెక్టోరల్ ఆఫీసర్గా బదిలీపై వెళ్లారు. దీంతో మండల ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తూరు మండల కేంద్రంలోని రాధా గార్డెన్స్ ఫంక్షన్హాల్లో వీడ్కోలు ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిస్ట్రిక్ సెక్టోరియల్ ఆఫీసర్ కృష్ణయ్య దంపతులను పూలమాల, శాలువతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదని, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన కొనసాగుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించేటువంటి వసతుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఇన్నేండ్లుగా ఎంఈఓగా కృష్ణయ్య అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ముదిరాజ్, కొత్తూరు మున్సిపాలిటి చైర్పర్సన్ లావణ్య దేవేందర్యాదవ్, వైస్ చైర్మన్ రవిందర్యాదవ్, ఎంఈఓ కృష్టారెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ గుప్తా, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ యాదవ్, కొత్తూరు, నందిగామ పీఆర్టీయూ టీఎస్ మండలాధ్యక్షులు విజయసాగర్, రాఘవేందర్, ప్రధానకార్యదర్శులు ఆంజనేయులు, ప్రాణేశ్రావు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.