కొత్తూరు : జహంగీర్ పీర్ దర్గా విస్త్రరణకు 46ఎకరాలు భూమిని సేకరించామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గాలో నిర్వహించిన న్యాజ్ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దర్గా విస్త్రరణ, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 50 కోట్లు కేటాయించారని చెప్పారు. విస్తరణలో భాగంగా 46 ఎకరాలు స్థలాన్ని సేకరించామని మరో 4 ఎకరాలు సేకరించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కూడా దర్గా అభివృద్ధికి కృషి చేస్తాన్నారని గుర్తు చేశారు. అబ్బుర పడేలా దర్గాను అభివృద్ధి చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.
దర్గా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి
జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. అయితే దర్గా విస్తరణకు ప్రభుత్వం 50ఎకరాల స్థలం కేటాయించిం దని చెప్పారు. రెవెన్యూ రికార్డులో ఆ భూమిని నమోదు చేయలేదన్నారు. అందులో కొంత స్థలాన్ని ఇక్కడి వ్యాపారులు గజాల లెక్కలో కొని షెడ్లు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నా రని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపిండం కోసం దర్గా విస్త్రణల పనుల్లో కొంచం ఆలస్యమవుతుంద న్నారు. దర్గాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. తమ తాతల కాలం నుంచి ఇక్కడి చుట్టు పక్కల జిల్లాల ప్రజలు వచ్చి కందూర్ చేసేవారన్నారు. అంతకుమందు హోంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి చాదర్ మోసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.