వికారాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): నేటి నుంచి నిర్వహించే ‘కంటివెలుగు’కు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో మంత్రి సబితారెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రోజుకు 600 నుంచి 650 మంది వరకు కంటి పరీక్షలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. కంటివెలుగు కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. వినూత్నంగా ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలకు కరపత్రాలను అందజేసి ఆహ్వానం పలుకుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 80 బృందాలతో క్యాంపులు చేపడుతుండగా, వికారాబాద్ జిల్లాలో 42 కేంద్రాల్లో ప్రత్యేక బృందాలు సేవలందించేలా సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 99,382 కంటి అద్దాలు అందుబాటులో ఉంచారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన కండ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాకు 39,767 రీడింగ్ గ్లాసెస్ చేరుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని అన్ని వార్డు ల్లో చేపట్టేందుకు వైద్యారోగ్య అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం 42 బృం దాలను సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించనున్నారు. ఒక్కో బృందంలో ఎనిమిది మంది సభ్యులు ఉండనున్నారు. కంటి వెలుగు కార్యక్ర మ విజయవంతానికి అధికారులు జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటి వెలుగు ఆహ్వాన పత్రాలను గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలకు ఇప్పటికే వైద్యసిబ్బంది అందజేశారు. ప్రతిరో జూ గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి, మున్సిపాలిటీల్లో 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 3.48 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తు తం 10 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రాల వద్దకు ప్రజ లు ఒకేసారి రాకుండా ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికెళ్లి ఏ రోజున కంటి పరీక్షలకు రావాలో ప్రజలకు సూచించనున్నా రు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు, మందులతోపాటు అవసరమైన వారికి శస్త్ర చికి త్స కోసం హైదరాబాద్లోని సరోజిని దవాఖానకు రెఫర్ చేయనున్నారు.
క్యాంపులను 9 గంటలకు ప్రారంభించాలి
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలి. కంటి వెలుగు క్యాంపుల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. తాగునీటి, టెంట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ప్రతిరోజూ క్యాంపులను ఉదయం 9గంటలకు ప్రారంభించాలి. అందుకోసం వైద్యాధికారులు కేంద్రాలకు 15 నిమిషాల ముందే హాజరు కావాలి.
– నిఖిల,వికారాబాద్ కలెక్టర్