కడ్తాల్ : ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 114మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, లయన్స్క్లబ్ ఆఫ్ ఆమనగల్లు సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసరాల సరుకులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా ధృక్పథాన్ని కలిగి ఉండాలని తెలిపారు.
కార్యక్రమంలో లయన్స్క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నకిషన్రెడ్డి, సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ చైర్మన్ రామ్మూర్తి, జడ్పీటీసీలు దశరథ్నాయక్, విజితారెడ్డి, సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.