కడ్తాల్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని శాసన మండలిలో నిర్వహించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రమాణ స్వీకరానికి కడ్తాల్ మండలం నుంచి భారీ ఎత్తున టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డికి నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, నాయకులు భాస్కర్రెడ్డి, వేణుగోపాల్, చందోజీ, గోపాల్రెడ్డి, మోత్యానాయక్, నరేశ్నాయక్, బిక్కునాయక్, జహంగీర్అలీ, కృష్ణ, శేఖర్గౌడ్, డాక్టర్ శ్రీనివాస్, ప్రభులింగం, భూనాథ్నాయక్, సుమన్, లక్ష్మయ్య, శంకర్, నాయకులు పాల్గొన్నారు.