మంచాల, జనవరి 4: మంచాల మండలం పటేల్చెర్వుతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు జనసందేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంస్థ సభ్యులు నోట్ బుక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి దన్నె భాషయ్య మాట్లాడుతూ జనసందేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతి విద్యార్థికి నోట్పుస్తకాలతో పాటు తదితర వస్తువులు అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో పటేల్ చెర్వుతండా సర్పంచ్ రాజునాయక్, ఆరుట్ల ఉపసర్పంచ్ జంగయ్యగౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ నూకం రాజు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.