కడ్తాల్, సెప్టెంబర్ 30: రాజకీయ విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి జైపాల్రెడ్డి అని, రాజకీయ నాయకులు, యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మా డ్గుల మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్రెడ్డి విగ్రహావిష్కరణ, స్మారక గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతారాం ఏచూరి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుభాశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతిని ధి మందా జగన్నాథం, ఎంపీలు రాములు, రేవంత్రెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మాజీ ఎంపీలు సయ్యద్ ఆజీజ్ పాషా, మల్లు రవి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రాంరెడ్డి అధ్యక్షతన జరి గిన సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ జైపాల్రెడ్డి దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని అన్నారు. ఆయనతో తనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే అనుబంధం ఉన్నదని, దేశానికి ఆయ న నిస్వార్థంగా సేవలందించారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో జైపాల్రెడ్డి ఆంగ్లంలో చేసే ప్రసంగాలకు అర్థం తెలియక, కొంతమంది నాయకులు డిక్షనరీలను వెతికిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుభాశ్రెడ్డి మాట్లాడుతూ జైపాల్రెడ్డి మంచి విలువలు ఉన్న రాజకీయ నాయకుడని, ఆయన చిత్తశుద్ధితో దేశానికి సేవలందించారన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ జైపాల్రెడ్డి ఒక తరం నాయకులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్రెడ్డి కృషి ఎంతో ఉన్నదని, కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో జైపాల్రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మందా జగన్నాథం మాట్లాడుతూ నిస్వార్థంగా, నిబద్ధతగా జైపాల్రెడ్డి దేశానికి సేవ చేశారన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ జైపాల్రెడ్డి రాజకీయాల్లో ఆణిముత్యంలాంటి నాయకుడని, మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఎంపీ రేవంత్రెడ్డి మాట్లాడుతూ జైపాల్రెడ్డి మచ్చలేని మహానాయకుడ ని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జైపాల్రెడ్డి పేద వర్గాల పక్షపాతి అని, విద్యార్థి నాయకుడిగానే ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు జైపాల్రెడ్డి అని, ఆయన కల్వకుర్తి ప్రాంతవాసి కావడం తమ అదృష్టమన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ జైపాల్రెడ్డి తన రాజకీయ గురువని, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం జైపాల్రెడ్డి జీవిత ప్రయాణానికి సంబంధించిన కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ పద్మారెడ్డి, జడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, జైపాల్రెడ్డి సతీమణి లక్ష్మమ్మ, కుమారులు ఆనంద్, అరవింద్, కుమార్తె అరుణ, సోదరులు పద్మారెడ్డి, మనోహర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ జంగయ్యగౌడ్, ఎంపీటీసీలు కిషన్రెడ్డి, జైపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్లుగౌడ్, రమేశ్రెడ్డి, వెంకటయ్య, కృష్ణారెడ్డి, సురేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వెంకటేశ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.