షాద్నగర్టౌన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల (షాద్నగర్ నూర్ కళాశాల)లో ఈ నెల 10 వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్నచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో కనీసం 40శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కళాశాలలో బీఎస్సీ (బీజడ్సీ, ఎంజడ్సీ, ఎంసీసీ, ఎంఎస్సీఎస్), బీకాం కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకు ఈ నెల 23న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. tswreis.as.in,telangana gurukulam.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9494569707,8247076647,9502963320,8008402237ను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.