కాచిగూడ,జూన్ 25: ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, మున్నూరు కాపులు కలిసిమెలిసి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాలులో మున్నూరుకాపు వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మున్నూరు కాపులకు 5 ఎకరాల భూమి, భవన నిర్మాణానికి రూ.5 కోట్లు ఇచ్చిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపుల్లో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర మాట్లాడుతూ… మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ సహకారంతో మున్నూరుకాపు కార్పొరేషన్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మున్నూరుకాపులు జవాబుదారిగా ఉండాలన్నారు. ఈ వివాహ పరిచయ వేదికలో రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా యువతి, యువకులు పాల్గొని వివాహ సంబంధాలు కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి హన్మంత్రావు, వినోద్కుమార్, వివాహ పరిచయ వేదిక చైర్మన్ గోపాల రాధాకృష్ణ, కన్వీనర్ శ్రీనివాస్, రమేశ్కుమార్, అనిల్కుమార్, సురేశ్బాబు, శ్రీనివాసులు, జి.శ్రీకాంత్, సత్యేందర్, రమణాకర్, రవీందర్, మాణిక్యరావు, జ్ఞానేశ్వర్రావు, సత్యనారాయణ, సదానంద్, లెనిన్బాబు, ప్రవీణ్, రాధాకృష్ణ, సాయికృష్ణ, జైపాల్రెడ్డి, ప్రకాశ్, గంగం రవి, సోమారపు అరుణ్, కైలాస్ రాకేశ్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.