తాండూరు, డిసెంబర్ 25: తాండూరు నియోజకవర్గంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు మెథడిస్ట్ చర్చి, శివాజీచౌక్, ఇంద్రానగర్లోని హెబ్రోన్చర్చిల్లో, సెయింట్ మార్క్స్ చర్చి, సాయిపూరు కింగంసాలెం చర్చి, రాజీవ్గృహకల్పలోని నజరేతు చర్చిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన ల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏసు ప్రభువును కొలుస్తూ భక్తులు ఆలాపించిన దైవభక్తి గీతాలు, కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు చర్చిలకు వెళ్లి కేక్ కట్చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నజరేతు చర్చిలో కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని చర్చిల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి : ఎమ్మెల్సీ
పెద్దేముల్, డిసెంబర్ 25 : ఏసుక్రీస్తు అనుగ్రహంతోప్రతి ఒక్కరూ సుఖ:సంతోషాల తో ఉండాలని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కంద నెల్లి గ్రామ సమీపం లో కందనెల్లి మాజీ ఎంపీటీసీ కుమారుడు కిరణ్కుమార్ ఆధ్వ ర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్య క్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్,బీఆర్ఎస్ నాయ కులు కరణం పురుషోత్తంరావు, మధుసూదన్రెడ్డి, సురేందర్రెడ్డి,వడ్డే శ్రీనివాస్, సిద్రాల శ్రీని వాస్, భీమప్ప, వెంకటయ్య, బాల్రెడ్డి, రవీందర్రెడ్డి, రఘు, అశోక్, శ్రీకాంత్రెడ్డి, హరీశ్వర్రెడ్డి, సిద్దు, కందనెల్లి సలాం తదితరులు పాల్గొన్నారు.
ఏసు క్రీస్తు బోధనలు ఆచరణీయం
వికారాబాద్, డిసెంబర్ 25: వికారాబాద్లో మెథడిస్ట్ చర్చిలో బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏసు ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని, క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నెల కొనాలని ఆకాక్షించారు. క్రిస్మస్ వేడుకల్లో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మర్పల్లి మండల అధ్యక్షులు శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
రూ. ఐదు లక్షల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి టౌన్, డిసెంబర్ 25 : పరిగి పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. తుంకులగడ్డలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పాల్గొని కేక్ కట్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి అభివృద్ధి పనులకు గాను ఐదు లక్షల రూపాయల ప్రొసీడింగ్ను చర్చి పాస్టర్కు అంద జేశారు. ప్రేమ్నగర్ కాలనీలోని మెథడిస్ట్, ఏసు స్నేహనిలయం, రాఘవపూర్ గ్రా మంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్రెడ్డి, రైతు బంధుసమితి అధ్యక్షుడు రాజేందర్, జేఏసీ నాయకుడు రవి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆటల పోటీలు
బొంరాస్పేట, డిసెంబర్ 25 : మండలంలోని మెట్లకుంట గ్రామంలో సాయంత్రం జరిగిన ఆటల పోటీల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని పరుగెత్తే పోటీలు, కళ్లకు గంతలు కట్టుకుని కుండలు పగులగొట్టడం, పరుగెత్తుతూ సూదిలో దారం ఎక్కించడం, నీళ్ల కుండలు ఎత్తుకుని పరిగెత్తడం, కుండలో గింజలు పోసి ఏరడం, త్రోబాల్ వంటి పలు రకాల ఆటల పోటీలను ఆనందోత్సహాల మధ్య జరుపుకొన్నారు. పలు సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు క్రిస్మస్ తాతయ్య వేషాధార ణలు వేసి అలరించారు. క్రిస్మస్ తాతయ్యలతో చిన్న పిల్లలు ఉత్సాహంగా గడిపారు. ఆటల పోటీలలో పాల్గొన్న వారికి క్రిస్మస్ తాతలు బహుమతులు అందజేశారు. రేగడిమైలా రం చర్చిలో మహేష్ వంద మందికి కొత్త నిబంధనల బైబిల్ళ్లను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
మర్పల్లి, డిసెంబర్ 25 : క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ మండల ఎస్టీసెల్ అధ్య క్షుడు జైసింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ యాదయ్య, రాథోడ్ ప్రేమ్కుమార్, బీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డితో కలిసి ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను ఆయన నివాసంలో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కొడంగల్ పట్టణంలో..
కొడంగల్, డిసెంబర్ 25: కొడంగల్ పట్టణంలోని మెథడిస్ట్ చర్చిలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేవీ రాజేందర్, రాంరెడ్డితో పాటు పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.
క్రైస్తవులకు ప్రీతికరమైన రోజు
యాలాల, డిసెంబర్ 25: ప్రేమ భావాన్ని, సేవతత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతికరమైన రోజని ఎంపీపీ బాలేశ్వరగుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. దేవనూరు గ్రా మంలో చర్చి ఫాదర్ కృపాకర్తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్ర మంలో వైస్ ఎంపీపీ రమేశ్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షుడు రాములు, సర్పంచులు శివకుమార్, మధుసూదన్రెడ్డి, నాయకులు ఆశన్న, వెంకట్, కృష్ణ పాల్గొన్నారు.
కులకచర్ల మండల పరిధిలో
దోమ, డిసెంబర్25: కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక సర్పంచ్ లక్ష్మీ ఆనంద్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలి పారు.కార్యక్రమంలో గ్రామ నాయకుడు షర్పద్దీన్, పాస్టర్ డేనియల్ రాజు, చంద్రయ్య, వెంకటేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.